కర్నూలు జిల్లాలోని ప్రసిద్ధ శైవ క్షేత్రము శ్రీశైలం ఆలయం. హరహర మహదేవ శంభో శంకరా అంటూ భక్తుల గొంతులతో మారుమ్రోగుతూ నల్లమల అడవులలో కొండగుట్టల మధ్య గల శ్రీమల్లికార్జునుని పవిత్ర క్షేత్రమైన శ్రీశైలంలో దసరా మహాత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. భ్రమరాంబ దేవికి ఈవో, అర్చకులు పూజా ద్రవ్యాలు సమర్పించి ఉత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ చేశారు. ఇవాళ సాయంత్రం శైలపుత్రి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. అనంతరం స్వామి, అమ్మవార్లకు భృంగి వాహనంపై గ్రామోత్సవం నిర్వహించనున్నారని ఆలయ అధికారులు తెలిపారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa