అమరావతి: అవినీతి రహిత పాలనకు అధునాత సాంకేతికత వినియోగించుకోవాలని మంత్రి లోకేశ్ అన్నారు. మైక్రోసాఫ్ట్ ప్రతినిధులతో లోకేశ్ భేటీ అయి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో సాంకేతికత వినియోగంపై చర్చించారు. కైజాలా ఆధారంగా మైక్రోసాఫ్ట్ తయారు చేసిన అధునాతన సాంకేతికతపై ప్రతినిధులు వివరణ ఇచ్చారు. వీలైనంత త్వరగా ప్రభుత్వంలోని అన్ని శాఖల అనుసంధానానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు లోకేశ్ తెలిపారు. పార్టీ కార్యక్రమాలు, సాంకేతికత అనుసంధానం అనే అంశంపై చర్చ జరపాలన్నారు.