కృష్ణంరాజు వారసుడిగానే ప్రభాస్ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. కృష్ణంరాజు తాజాగా 'బాహుబలి 2' సినిమా చూశారు. బలమైన కథా కథనాలతో ఈ సినిమాను రాజమౌళి ఆద్భుతంగా తీర్చిదిద్దాడని ఆయన అన్నారు. ప్రతి పాత్రను ప్రత్యేకంగా మలిచి తెరపై గొప్పగా ఆవిష్కరించాడని చెప్పారు. అంతర్జాతీయ స్థాయి దర్శకుడు ఇండియాలో ఉన్నాడనే విషయాన్నిఈ సినిమా నిరూపించిందని అన్నారు. నటీ నటులందరూ చాలా చక్కగా తమ పాత్రలను పోషించారని చెప్పారు. కీరవాణి అందించిన సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని అన్నారు. రాజమౌళి ప్రతిభకు ఈ సినిమా నిలువెత్తు నిదర్శనమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.