ఎప్పుడా ఎప్పుడా అని ప్రేక్షకులు దేశ వ్యాప్తంగా ఎదురుచూస్తున్న బాహుబలి 2 సినిమా ఈ రోజు విడుదలైంది. గురువారం సాయంత్రం నుంచే తెలుగు రాష్ట్రాల్లోని ప్రభాస్ అభిమానులు సినిమా ధియేటర్ల పెద్ద ఎత్తున కటౌట్లను ఏర్పాటు చేసి... పాలాభిషేకం చేయడం విశేషం. చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ సినిమాలు విడుదలైనపుడు ఆయా హీరోల ఫ్యాన్స్ చేసే హడావిడి మామూలుగా ఉండదు. బాహుబలి 2 సినిమా విడుదల సందర్భంగా ప్రభాస్ ఫ్యాన్స్...ధియేటర్ల దగ్గర టపాకాయలు కాల్చి.... తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. గురువారం రాత్రి బాహుబలి ప్రీమియర్ షోలు పడగా, శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి రెగ్యులర్ షోలు నడుస్తున్నాయి. దేశ వ్యాప్తంగా... బాహుబలి మానియా కనిపిస్తోంది. ఒక్క తమిళనాడులో మాత్రం ఉదయం ఆటలు పడలేదు.
గోదావరి జిల్లాల్లో హడావుడి కూడా ఎక్కువగానే ఉంది. ఏలూరు, భీమవరం పట్టణాల్లో బాహుబలి ఫీవర్ స్పష్టంగా కనిపిస్తోంది. అనేక నగరాల్లో ధియేటర్ల వద్ద ప్రభాస్ ఫ్యాన్స్... భారీ కటౌట్లను ఏర్పాటు చేశారు.