న్యూఢిల్లీ : కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్, పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఒక సూచన చేశారు. పార్టీ అధినేత్రి సోనియా గాంధీలా పార్టీ శ్రేణులకు మరింత అందుబాటులో ఉండాలని సూచించారు. అలాగే పార్టీ ప్రధాన కార్యాలయంలో ఎక్కువ సేపు గడపాలని షీలా దీక్షిత్ రాహుల్ గాంధీకి సలహా ఇచ్చారు.