ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీబీఐ కోర్టుకు వైసీపీ అధినేత జగన్ హాజరు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Apr 28, 2017, 10:54 AM

హైదరాబాదులోని సీబీఐ కోర్టుకు వైసీపీ అధినేత జగన్ హాజరయ్యారు. అక్రమాస్తుల కేసులో సాక్షులను ప్రభావితం చేస్తున్నారన్న నేపథ్యంలో జగన్ బెయిల్ ను రద్దు చేయాలంటూ సీబీఐ వేసిన ఛార్జ్ షీట్ పై నేడు కోర్టు కీలక తీర్పును వెలువరించనుంది. ఈ నేపథ్యంలో, వైసీపీ శ్రేణుల్లో నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది. కోర్టు తీర్పు ఎలా వెలువడబోతోందో అనే టెన్షన్ అలముకుంది. జగన్ మళ్లీ జైలుకు వెళ్లే పరిస్థితి వస్తే... కిం కర్తవ్యం అనే భయం వారిలో నెలకొంది. ఈ నెల 7, 21 తేదీల్లో ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు... తీర్పును నేటికి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో, జగన్ కు బెయిలా? జైలా? అనే విషయం ఉదయం 11 గంటల నుంచి సాయంత్ర 4 గంటల్లోపు తేలిపోబోతోంది. అంతవరకు జగన్ కోర్టులోనే ఉండే అవకాశం కనిపిస్తోంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com