విజయవాడ: ఈ నెల 29న అక్షయ తృతీయ సందర్భంగా దుర్గగుడిలో శ్రీ మహాలక్ష్మీయాగం నిర్వహిస్తున్నట్లు ఆలయం ఈవో సూర్యకుమారి తెలిపారు. అదే రోజు ఉదయం 9 గంటలకు యాగం ప్రారంభిస్తామని చెప్పారు. ఈ యాగంలో దంపతులు భారీగా పాల్గొనాలని పిలుపు నిచ్చారు. పూజా రుసుం 1000 రూపాయలుగా ప్రకటించారు. మీ సేవ, ఏపీ ఆన్ లైన్తో పాటు దేవస్థానంలోనూ టికెట్లు తీసుకోవచ్చని ఈవో వెల్లడించారు.