యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు ఈ రోజు చాలా స్పెషల్ డే అని చెప్పవచ్చు. ఒక వైపు బాహుబలి 2 సినిమా రిలీజ్ కి రెడీ కాగా, మరో వైపు అభిమానుల ఆనందాన్ని మరింత పెంచేందుకు ప్రభాస్ 19వ చిత్ర యూనిట్ టీజర్ ని రిలీజ్ చేసింది. రన్ రాజా రన్ ఫేం సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ 19వ మూవీ సాహో తెరకెక్కనుండగా, ఈ చిత్రం 150 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందనున్నట్టు తెలుస్తుంది. తెలుగు, తమిళం, హిందీ భాషలలో ఏకకాలంలో రూపొందనున్న ఈ చిత్రానికి హాలీవుడ్ స్టంట్ మాస్టర్ కెన్నీ బేట్స్ పనిచేయనుండగా బాలీవుడ్ సంగీత దర్శకుల త్రయం శంకర్, ఇహసాన్, లోయ్ లు సంగీతాన్ని అందించనున్నారు. ఇక ‘ఘాజి’ ఫేమ్ మది సినిమాటోగ్రఫీ అందించనున్నారు. ఐదు సంవత్సరాల నుండి ప్రభాస్ ని ఒకే గెటప్ లో చూసిన ఆడియన్స్ కి ఈ టీజర్ చాలా థ్రిల్ ని కలిగిస్తుంది. తెలుగు,తమిళం, మలయాళం, హిందీ భాషలలో విడుదలైన టీజర్ పై మీరు ఓ లుక్కేయండి
.