ఢిల్లీ : ఢిల్లీలో ఇవాళ కేంద్ర మంత్రి వెంకయ్యతో ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... ఏపి అసెంబ్లీ స్ధానాల సంఖ్య పెంచడానికి కేంద్రం సుముఖంగా ఉందని తెలిపారు. స్ధానాలు పెంచాలని రెండు రాష్ట్రాలు కోరుతున్నాయి. జనాభా పెరిగింది, ప్రజాప్రతినిధులు పెరగాల్సిన అవసరం ఉందన్నారు.