కర్నూలు జిల్లాను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలోని చిప్పగిరి, ఓర్వకల్లు, బండి ఆత్మకూరు, ఆస్పరి, హోళగుంద, మంత్రాలయం, కోసిగి, మిడుతూరు మండలాల్లో భారీగా వర్షం కురుస్తోంది. ఆదోనిలో ఆవుదూడవంక పొంగి ప్రవహిస్తుడంటం వల్ల సమీపంలోని ఇళ్లలోకి నీరుచేరింది. పాములపాడు మండలంలో పంటపొలాలు చెరువును తలపిస్తున్నాయి. కోసిగిలో చాపవాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. డోన్ మండలం దేవరబండ వద్ద రహదారిపై విద్యుత్ స్తంభం కూలిపోయింది.హొళగుంద మండలం ఇంగళహాల్-ఎండీ హళ్లి మధ్య వంక పొంగిపొర్లుతోంది. మహానంది మండలంలో తమడపల్లి చెరువు ప్రమాదకరంగా మారింది. బుక్కాపురం గ్రామానికి ప్రమాదం పొంచి ఉండటంతో.. అధికారులు అప్రమత్తమయ్యారు. ఆలూరు నియోజకవర్గంలో గత రాత్రి నుంచి కురిసిన భారీ వర్షానికి వాగులు వంకలు పొంగి పొర్లాయి.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa