అమరావతి : సచివాలయంలోని తన ఛాంబర్లో మంత్రి లోకేశ్ ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా పంచాయతీరాజ్ ప్రగతి, పురోగతిపై ఆ రంగంలో అనుభవం, అభిరుచి ఉన్న 40 మంది ఎమ్మెల్యేలతో ఆయన భేటీ అయ్యారు. పంచాయతీలలో మౌలిక సదుపాయాల కల్పన, గ్రామీణాభివృద్ధి తదితర అంశాలపై వారితో చర్చిస్తున్నారు.