అమరావతి : కియామోటార్స్ కార్ల తయారీ పరిశ్రమను ఏపీలో ఏర్పాటు చేయడానికి ఏపీ ప్రభుత్వం- కియామోటార్స్ మధ్య ఈ రోజు అవగాహన ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. అనంతరం కియా మోటార్స్ ప్రెసిడెంట్ పార్క్ చంద్రబాబుకు మెమెంటో బహుకరించారు. అనంతరం చంద్రబాబు కియా మోటార్స్ బృందాన్ని సత్కరించారు.