అమరావతి:ప్రయాణిల రద్దీ దృష్ట్యా రాబోయే నెల రోజుల్లో 10 ప్రత్యేక రైళ్లను గుంటూరు మీదగా నడపనున్నట్లు రైల్వే గుంటూరు ఏసీఎం ఎండీ ఆలిఖాన్ తెలిపారు. నెంబర్ 07425 కాచీగూడ – కాకినాడ పోర్టు ప్రత్యేక రైలు ఈ నెల 28, మే 5, 12, 19, 26 తేదీల్లో సాయంత్రం 6.45 గంటలకు బయలుదేరి మల్కాజ్గిరి, చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ మీదగా రాత్రి 11.07ఉక పిడుగురాళ్ల, 12.30కి సత్తెనపల్లి, 1.30కి గుంటూరు చేరుకొని విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకో ట, కాకినాడ టౌన మీదగా మరుసటి రోజు ఉదయం 6 గంటలకు కాకినాడ పోర్టు చేరుకొంటుంది. నెంబర్ 07426 కాకినాడ పోర్టు – కాచీ గూడ ప్రత్యేక రైలు ఈ నెల 29, మే 6, 13, 20, 27 తేదీల్లో సాయంత్రం 5.50 గంటలకు బయలుదేరి రాత్రి 11 గంటలకు గుంటూరు, 11.48కి సత్తెనపల్లి, అర్ధరాత్రి 12.10కి పిడుగురాళ్ల చేరుకొని మరుసటి రోజు వేకువజామున 4.25కి మల్కాజ్గిరి, 5.10కి కాచీగూడ చేరుకొంటుంది. ఈ రైళ్లలో ఏసీ టూ టైర్, మూడు త్రీ టైర్, ఎనిమిది స్లీపర్క్లాస్ బోగీలు ఉంటాయని ఆయన తెలిపారు.