అమరావతి : రాజధాని పనుల పురోగతిపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. కృష్ణానదిపై నుంచి అమరావతికి ఎన్ని వారధులు అవసరమో సమగ్ర ప్రణాళికను రూపొందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. ప్రజారవాణా వ్యవస్థలో చోదకుడు లేని విద్యుత్ బస్సులు, మెట్రో రైలు, తక్కువ దూరానికి జల మార్గాలు ఉంటాయని సీఎం అన్నారు. బస్ స్టేషన్లు, మెట్రో రైలు స్టేషన్లు, పార్కింగ్ ఏరియాలు అండర్ గ్రౌండ్లోఉండేలా చూడాలని సీఎం చంద్రబాబు సూచించారు.