బీబీనగర్: పది రూపాయల నాణేలు చెల్లవనే వదంతులతో నాలుగు రోజుల్లోనే యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్లోని అన్ని బ్యాంకు శాఖల్లో సుమారు రూ.10 లక్షల విలువైన రూ.10 నాణేలు జమయ్యాయి. ఈ నాణేల వల్ల చిరువ్యాపారులకు వినియోగదారులకు మధ్య వాగ్వాదాలు జరుగుతున్నాయి.రిజర్వుబ్యాంకు అధికారులు, బ్యాంకుల ప్రతినిధులు ఇప్పటికైనా స్పందించి రూ.10 నాణేంపై స్పష్టమైన ప్రకటన చేయాల్సిన అవసరం ఉంది. పది రూపాయల నాణేలు రద్దు అవాస్తవమని, చిల్లర వ్యాపారులు నాణేలను స్వీకరించాలని, ఖాతాదారుల నుంచి వస్తున్న నాణేలను బ్యాంకులో జమ చేసుకుంటున్నామని బీబీనగర్ ఆంధ్రాబ్యాంక్ మేనేజర్ గొట్టిపాటి శేషసాయి చెప్పారు.