గుంటూరు : మిర్చియార్డులో సమస్యలపై మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి, నక్కా ఆనంద్ బాబులు సమీక్షించారు. రైతుల సమస్యల పరిష్కారం విషయంలో ప్రభుత్వం ఖర్చుకు వెనుకాడబోదని చెప్పారు. మిర్చి రైతులు ఆందోళన చెందవద్దని చెప్పారు. ఒకే సారి ఎక్కువ మిర్చిని మార్కెట్ కు తీసుకురావడం వల్ల ధర తగ్గ అవకాశం ఉందని మంత్రులు పేర్కొన్నారు.