ట్రెండింగ్
Epaper    English    தமிழ்

`ఆంధ్ర శశికళ లోకేష్‌'

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 18, 2017, 01:20 AM

విజయవాడ, మేజర్‌న్యూస్‌: ఆంధ్ర జయలలిత అంటే చంద్రబాబు నాయుడు అని, ఆంధ్ర శశికళ అంటే ఆయన కొడుకు లోకేష్‌ అని వైసీపీ నేత వెల్లంపల్లి శ్రీనివాస్‌ విమర్శించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాటా ్లడుతూ అవినీతిలో కూరుకుపోయిన టీడీపీ నేతలు ప్రతిపక్ష నేత వై. ఎస్‌. జగన్‌పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు రాజకీయాల్లోకి రాక ముందు ఆయనకు ఆస్తి ఎంత ఉందని, రెండు ఎకరాలున్న ఆయన 2 లక్షల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని, ఏపీని అవినీతి రాష్ట్రంగా మార్చారని వెల్లంపల్లి ఆరోపించారు. ఓటుకు నోటు కేసులో రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయిన చంద్రబాబా వైఎస్‌ జగన్‌ను విమర్శించేది అని ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసుకు భయపడే ప్రత్యేక హోదా అంశాన్ని పక్కనబెట్టారని విమర్శించారు. మామకు వెన్నుపోటు పొడిచారని, ఇప్పుడు ఏపీ ప్రజలకు వెన్నుపోటు పొడుస్తున్నారని అన్నారు. గుంటూరులో జరిగిన యువభేరిలో పిల్ల లు అడిగిన ప్రశ్నలకు కూడా చంద్రబాబు సమాధానం చెప్పలేరని అన్నారు. చంద్రబాబుకు దమ్మూ, ధైర్యం ఉంటే పార్టీలోకి అనైతికంగా చేర్చుకున్న 21 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లాలని సవాల్‌ చేశారు. వైఎస్‌ జగన్‌పై లేనిపోని తప్పుడు ఆరోపణలు చేయడం మానుకుని, ఎన్నికల హామీ లను నిలబెట్టుకుని రాషా్టభ్రివృద్దికి కృషి చేయాలని వెల్లంపల్లి హితవు పలికారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com