దిల్లీ : దిల్లీ నగరపాలక ఎన్నికల్లో కాంగ్రెస్ మూడో స్థానానికి పరిమితమైంది. పార్టీ ఘోర పరాజయానికి బాధ్యత వహిస్తున్నట్లు దిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ మాకెన్ తెలిపారు. దిల్లీ అధ్యక్ష బాధ్యతలకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తన రాజీనామాను పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలకు సమర్పించనున్నట్లు వెల్లడించారు. ఇకపై పార్టీలో సామాన్య కార్యకర్తలాగా పనిచేస్తానని చెప్పారు.దిల్లీ నగర పాలక ఎన్నికల ఫలితాలు ఈ రోజు వెలువడ్డాయి. స్పష్టమైన ఆధిక్యంతో మూడు నగరపాలక సంస్థలను భాజపా కైవసం చేసుకుంది. ఇక దిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ రెండో స్థానంలో ఉండగా.. కాంగ్రెస్ మూడో స్థానానికి పరిమితమైంది.