న్యూఢిల్లీ : ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి అజయ్ మాకెన్ రాజీనామా చేశారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఓటమికి బాధ్యత వహిస్తూ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు అజయ్ మాకెన్ ప్రకటించారు. నేటి నుంచి ఏడాది పాటు కేవలం పార్టీ కార్యకర్తగానే కొనసాగుతానని స్పష్టం చేశారు. పార్టీలో ఎలాంటి బాధ్యతలు తీసుకొనని తేల్చిచెప్పారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ 180 స్థానాల్లో ముందంజలో ఉన్నది. ఆప్ రెండో స్థానంలో ఉండగా, కాంగ్రెస్ చివరిస్థానంలో ఉన్నది. మొత్తం 270 వార్డులకు ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. మరికాసేపట్లో పూర్తి స్థాయిలో ఫలితాలు వెలువడనున్నాయి.