అనంతపురం: అనంతపురం జిల్లా మడకశిరలో పశుగ్రాసం కోసం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులు ఆందోళన చేస్తున్నారు. తహసీల్దార్ కార్యాలయం ముందు ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి నిరసన తెలిపారు. తహసీల్దార్ కార్యాలయం ఆవరణంలో రైతులు తమ పశువుల్ని కట్టేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.