హైదరాబాద్ : కళాతపస్వి కే.విశ్వనాథ్ కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు రావడం తెలుగువారందరికీ గర్వకారణమని జనసేన అధినేత, నటుడు పవన్ కల్యాణ్ అన్నారు. విశ్వనాథ్ ను అభినందించేందుకు ఆయన నివాసానికి వెళ్లిన పవన్ కల్యాణ్ విశ్వనాథ్ సినిమాలన్నీ అద్భుతమైనవన్నారు. తన చిన్నప్పుడు శంకరాభరణం సినిమాను చాలా సార్లు చూశాననని పవన్ అన్నారు. పవన్ తో పాటు విశ్వనాథ్ ను అభినందించిన దర్శకుడు త్రివిక్రమ్ మాట్లాడుతూ కే.విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ఒక్కో సినిమా ఒక్కో ఆణిముత్యమని పేర్కొన్నారు. ఆయన దేశం గర్వించదగ్గ సినిమాలు తీశారన్నారు.