ఎట్టకేలకు శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్ అరెస్టు అయ్యాడు. రెండాకుల గుర్తు కోసం ఎన్నికల కమిషన్ కు మధ్యవర్తి ద్వారా భారీగా లంచం ఇవ్వజూపినట్టు ఆయనలో తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. ఢిల్లీ పోలీసులు పక్కా ఆధారాలు తమ దగ్గర ఉన్నాయని కూడా చెబుతున్నారు. ఆ కేసులో విచారణ నిమిత్తం శనివారం నాడు ఢిల్లీ రావాల్సిందిగా దినకరన్ కు సమన్లు జారీ చేశారు ఢిల్లీ క్రైమ్ బ్యూరో పోలీసులు. అప్పటి నుంచి నాలుగు రోజులుగా విచారణ చేశాక మంగళవారం అర్థరాత్రి దాటాక దినకరన్ ను అరెస్టు చేశారు పోలీసులు. ఆయనతో పాటూ దినకరన్ అనుచరుడు, మిత్రుడు మల్లికార్జునను కూడా అరెస్టు చేశారు. కేసులో కీలక వ్యక్తి అయిన సుకేశ్ చంద్రశేఖర్ ను తాను కలిసినట్టు దినకరన్ అంగీకరించారు. అతడిని తాను హైకోర్టు న్యాయమూర్తి అనుకున్నానని పోలీసులకు తెలిపారు. కానీ పోలీసులు వారిద్దరి మధ్య జరిగిన వీడియో సంభాషణని వినిపించారని అప్పుడు దినకరన్ తనకు సుఖేష్ తో ఉన్న పరిచయాన్ని పోలీసులు ముందు అంగీకరించారని సమాచారం.