గుంటూరు: డెల్టా ప్యాసింజర్ రైలులో కొందరు దుండగులు దోపిడీకి పాల్పడ్డారు. ఈ చోరీ ఘటన ఏపీలోని గుంటూరు జిల్లా నడికుడి-పొందుగుల మార్గంలో చోటుచేసుకుంది. దుండగులు ప్రయాణికుల వద్ద నుంచి 25 తులాల బంగారం, రూ. 50 వేల నగదును అపహరించుకుపోయారు. బాధితుల ఫిర్యాదు మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.