అమరావతి : పెట్రోలియం డీలర్లు ఏపీలో ఆందోళన బాట పట్టారు.ఏపీ పెట్రోలియం వ్యాపారుల సమాఖ్య (ఏపీఎఫ్పిటి) విజయవాడలో నిర్వహించిన అత్యవసర సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తసీుకున్నారు. సమాఖ్య అధ్యక్షుడు రావి గోపాల కృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వచ్చే నెల10వ తేదీన చమురు కంపెనీల నుంచి ఉత్పత్తుల కొనుగోలును నిలిపివేయాలని సమాఖ్య నిర్ణయించింది. ఆ తరువాత 14 వ తేదీ నుంచి ఆదివారాలు పెట్రోలు బంకులు మూసి ఉంచాలని నిర్ణయించింది. మే 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పెట్రోలు బంకులూ ఉదయం 9 నుంచి సాయంత్రం 6 వంటల వరకూ తెరిచి ఉంచాలని నిర్ణయించింది.