మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం అనుచరుడిగా నేరసామ్రాజ్యాన్ని విస్తరించి, విదేశాల్లో పట్టుబడి భారత్ లోని తీహార్ జైలులో రిమాండ్ ఖైదీగా విచారణ ఎదుర్కొంటున్న ఛోటా రాజన్ కు న్యాయస్థానం ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. నకిలీ పాస్ పోర్టు కేసులో ఆయన ను విచారించిన పటియాలా హౌస్ న్యాయస్థానం ఆయనను నేరస్తుడిగా నిర్ధారించింది. దీంతో ఆయనకు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. ఆయన నకిలీ పాస్ పోర్టుకు సహకరించిన ముగ్గురు అధికారులని ముద్దాయిలుగా నిర్ణయించి, వారికి జరిమానాతో పాటు జైలు శిక్షను విధించింది.