చెన్నై: ఛత్తీస్గఢ్లో సుకమా జిల్లాలో సోమవారం నక్సల్స్ జరిపిన కాల్పుల్లో మృతిచెందిన జవాన్ల కుటుంబాలకు తమిళనాడు ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. ఈ ఘటనలో తమిళనాడుకు చెందిన నలుగురు జవాన్లు మృతిచెందారు. వారి కుటుంబాలకు రూ.20లక్షల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. సుకమా జిల్లాలో మావోయిస్టులు మాటువేసి జరిపిన దాడిలో 25 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు.