హైదరాబాద్: వాయువ్య భారత్ నుంచి వీస్తున్న ఉష్ణగాలుల ప్రభావం తెలుగు రాష్ట్రాలను నిప్పుల కుంపటిలా మారుస్తోంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో తీవ్రస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాధారణం కంటే 4 నుంచి 6 డిగ్రీల మేర ఉష్ణోగ్రతల స్థాయి నమోదవుతున్నట్టు వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కడప జిల్లాలో అత్యధికంగా 44.5 డిగ్రీల ఉష్రోత నమోదు కాగా, తిరుపతి, కర్నూలు 44, గన్నవరం, రాజమండ్రి 43, నంద్యాల 42.8, నరసారావుపేట 42.3, ఓర్వకల్లు 42, అన్నవరం 41.3, అమరావతి 41.6, గుంటూరు 40.8, గుంతకల్లు 40.4, అనంతపురం 40, విజయవాడ 40.64, నందిగామ 41, ఒంగోలు 40, శ్రీకాకుళం 41, విజయనగరం 37, విశాఖ 37, అనకాపల్లి 36.8, కాకినాడ 38.9, మచిలీపట్నం 36, భీమవరం, ఏలూరు, తణుకు 38, జంగమహేశ్వరపురం 42 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.