సమయం లేదు మిత్రమా..! బాహుబలి 2 టిక్కెట్స్ తో సిద్దంగా ఉన్నారా, కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే ప్రశ్నకు సమాధానం తెలుసుకునే సమయం ఆసన్నమైంది. ఏప్రిల్ 28న తెలుగు, తమిళం, హిందీ, మలయాళ భాషలలో విడుదల కానున్న ఈ సినిమా కోసం ఊరు-వాడ, చిన్న-పెద్ద అనే తేడా లేకుండా అందరు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే బాహుబలి 2 చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఇటీవల విడుదలైన సినిమా ట్రైలర్ అభిమానులలో భారీ అంచనాలు పెంచిడంతో, బాక్సాఫీస్ వద్ద బాహుబలి చిత్రం చరిత్ర సృష్టించడం ఖాయం అని విశ్లేషకులు చెబుతున్నారు.బాహుబలి సినిమాకు సంబంధించి ఎలాంటి సీన్లు, వార్తలు బయటకు రాకుండా జక్కన్న చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. ఇటీవల ఇంటర్వ్యూలలో సినిమాకు సంబంధించి ఆసక్తికర వివరాలు వెల్లడించడంతో ప్రతి ఒక్కరు తొలి రోజే ఈ సినిమాను చూడాలని ఆరాటపడుతున్నారు. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ మొదలు కాగా థియేటర్లు వారం రోజుల వరకు హౌస్ ఫుల్ బోర్డులు పెట్టాయి. ఆన్ లైన్ లోను ఆల్ మోస్ట్ అన్ని షోస్ ఫుల్ అయ్యాయి. మరి బాహుబలి ఫీవర్ జనాల్లో అంతలా ఉంది. ఇదిలా ఉంటే సెన్సార్ బోర్డు సభ్యుడు ఉమైర్ సంధు తాజాగా ఈ సినిమాను వీక్షించి ట్విట్టర్ లో తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.బాహుబలి ది కంక్లూజన్ చిత్రం బాహుబలి ది బిగినింగ్ కన్నా వందశాతం బాగుందని, ఇటు టాలీవుడ్, అటు ప్రభాస్ ఫ్యాన్స్ పండుగ చేసుకునే టైం ఆసన్నమైందని ఉమైర్ తాజాగా ఓ ట్వీట్ చేశాడు. అయితే గతంలో ఉమైర్ పలు సినిమాలకు సంబంధించి పాజిటివ్ రివ్వూ ఇచ్చిన అవి బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఈ కారణంగా ఉమైర్ రివ్యూపై ఎవరు అంతగా ఫోకస్ పెట్టడం లేదు. కాని ఎవరు చెప్పిన, చెప్పకపోయిన బాహుబలి2 చిత్రం భారీ హిట్ కొట్టడమే కాకుండా చరిత్ర రికార్డులను తిరగ రాస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. చూడాలి మరి బాహుబలి 2 ఎన్ని అద్భుతాలు క్రియేట్ చేస్తుందో..!