విజయవాడ, సూర్యబ్యూరో : మినిస్ట్రీ ఆఫ్ ఎకానమీ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ (మేటీ), మినిస్ట్రీ ఆఫ్ ల్యాండ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్రాన్సపోర్టేషన్ టూరిజం (ఎంఎల్ఐటి), జపాన్ ఇంటర్నేషనల్ కో ఆపరేషన్ (జైకా) ప్రతినిధులు శుక్రవారం విజయవాడ ఎపీసీఆర్డీఎ కార్యాలయంలో కమీషనర్ చెరుకూరి శ్రీధర్తో సమావేశమయ్యారు. అమరావతి నగర అభివృద్ధిలో పాలుపంచు కునేందుకు జపాన్కుచెందిన మేటీ, ఎంఎల్ఐటి, జైకా ప్రతినిధుల బృందం ఆసక్తి కనబరిచింది. అమరావతిలో డిజిటల్ అండ్ స్మార్ట ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇండస్ట్రీస్ రీసెర్చ సెంటర్, స్పోర్ట్స సిటీ, స్టేడియాల అభివృద్ధిపై చర్చించారు. ఆయా ప్రాజెక్టుల ప్లానింగ్, అభివృద్ధికి సహకరించేందుకు ఆసక్తి వ్యక్తం చేశారు. జపాన్కు చెందిన 6 కంపెనీల ప్రతిపాదనలు ఎపీసీఆర్డీఎకు అంద జేస్తామని తెలియజేశారు. అవి ఆమోదయోగ్యంగా వుంటే పెట్టుబడులు రప్పిం చేందుకు సుముఖత వ్యక్తం చేశారు.