విజయవాడ, మేజర్న్యూస్ : ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యారంగాన్ని మరింత బలోపేతం చేయడంలో భాగంగా అంతర్జాతీయంగా వివిధ భాగస్వామ్య ఒప్పందాలు, ఎక్చేంజ్ ప్రోగ్రామ్లు చేయడానికి వీలుగా ఉన్నత విద్యా మండలి సలహాదారుగా ఈదర్ వెంకట్ను రాష్ర్ట ప్రభు త్వం నియమించింది. ఈ మేరకు ప్రభుత్వం జోవో ఆర్.టి నెం 25 ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది. ఒంగోలుకు చెందిన ఈదర వెంకట్ ప్రస్తుతం యూఎస్ఏ లోని ప్రోబ్స బిజినెస్ స్కూల్ ప్రోగ్రామ్ చైర్గా వ్యవహరిస్తున్నారు. 20 ఏళ్ల క్రితం యూ ఎస్ఏ వెళ్లిన ఆయన అప్పటి నుంచి వివిధ వర్శటీలకు అక్కడ సేవలు అందిస్తున్నారు. ఎమ్.ఎస్, ఎంబీఏ, పిహెచ్డి యూఎస్ఏలోనే చేశారు. వరల్డ అక్రిడిటేషన్ బోర్డు అయిన అక్రిడేషన్ కౌన్సిల్ ఫర్ బిజినెస్ స్కూల్స ప్రమోషన్ (ఏసీబీఎస్పీ) మెంబర్గా కూడా కొనసా గుతున్నారు. ఏపీలో నాణ్యమైన ఉన్నత విద్యను అందించేందుకు అంతర్జాతీ యంగా అక్రిడ ేషన్లు పొందేలా చూడటం, వివిధ సంస్థలతో ఎంఓయూలు కుదుర్చుకొనేలా చేయడం, స్టూడెంట్, ఫ్యాకల్టీ ఎక్చేంజ్ ప్రోగ్రాంల నిర్వహణ తదితర అంశాలలో ఉన్నత విద్యాశాఖకు సహకరించనున్నారు. ఈ సంద ర్బంగా ఆయన రాష్ర్ట మానవ వనరుల అభివద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాస రావుకు, ఉన్నతాధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.