సంగ్లి : మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మినీ బస్సు, ట్రక్కు ఢీకొన్న ఘటనలో ఆరుగురు ప్రయాణికులు చనిపోయారు. మరో పది మంది గాయపడ్డారు. సంగ్లి జిల్లాలో ఈ దుర్ఘటన జరిగింది. పండరిలో దర్శనం చేసుకుని వస్తున్న ఓ కుటుంబం మినీబస్సులో ఉంది. వారు కొల్హాపూర్ జిల్లాకు చెంది ఉంటారని అంచనా వేస్తున్నారు. చనిపోయిన వారిలో ఇద్దరు పిల్లలు ఉన్నారు.