గుంటూరు,సూర్యప్రతినిధి: తెనాలి పట్టణంలో తెలంగాణ సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కేసీఆర్ అభిమాన సంఘం ఆధ్వర్యంలో పట్టణంలోని చెంచుపేట శబరి వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి అందరికి పంచారు. ఖదీర్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాషా్టన్న్రి కేసీఆర్ పోరాడి సాధించుకున్నారని, ఏపీ ప్రత్యేక హోదా కోసం ఆయన స్ఫూర్తితో తాము ముందడుగు వేస్తామని అభిమానులు తెలిపారు.