అమరావతి :ఆంధ్రప్రదేశ్ కు చెందిన పలువురు మంత్రులు తమ వాహనాలపై నీలి బుగ్గను తొలగించేశారు. మంత్రులు చినరాజప్ప, పరిటాల సునీత, లోకేష్, అమర్ నాథ్ రెడ్డి తదితరులు తమ తమ వాహనాలపై నీలి బుగ్గను తొలగించి సీఎం నివాసంలో జరుగుతున్న పార్టీ సమన్వయ కమిటీ సమావేశానికి హాజరయ్యారు.