అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి నివాసంలో తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశం జరుగుతోంది. చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో ఇన్ చార్జి మంత్రుల నియామకం, మహానాడు వేదిక తదితర అంశాలపై చర్చిస్తున్నారు. ఈ సమావేశానికి హాజరైన పలువురు మంత్రులు తమ వాహనంపై నీలి బుగ్గ తీసివేసి హాజరయ్యారు.