అమరావతి, సూర్య ప్రధాన ప్రతినిధి : ప్రజలకు ప్రభుత్వం మరింత చేరువవ్వాలని నిత్యం తపించే ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు మరో బృహత్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రభుత్వం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నప్పటికి వివిధ కారణాల వల్ల ప్రజలకు పాలనాపరంగా కొన్ని సమస్యలు ఎదురవుతుంటాయి. అలాగే ప్రజలు తమకు ఉన్న ఆలోచనలు, అభిప్రాయాలూ పాలనా యంత్రంగంతో పంచుకోవాలని ఉంటుంది. వాటిని ఎవరికి చెప్పుకోవాలి. వాటిని వినే నాధుడే లేడా అనే పరిస్థితి తలెత్తుతూ ఉంటుంది. ఇలాంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని కాల్ సెంటర్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి సంకల్పించారు. మొత్తం 28 ప్రభుత్వ శాఖలను అనుసంధానిస్తూ ఈ కాల్ సెంటర్ పని చేస్తుంది. ఆయా శాఖలకు సంబంధించి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ కాల్ సెంటర్ ను శుక్రవారం ప్రారంభిస్తున్నారు. ఈ కాల్ సెంటర్కు సంబంధించిన కొన్ని ప్రధానాంశాలు ఇలా ఉన్నాయి. విజయవా డలోని గుంటుపల్లి వద్ద రాష్టప్రభ్రుత్వం ఆధ్వర్యంలో అత్యాధునిక కాల్ సెంటర్ ఏర్పాటైంది. 10వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో కార్యాలయం ఏర్పాటు చేశారు. ఒకేసారి 1200 మంది ఉద్యోగులు పనిచేసేలా సువిశాల భవనం ఇది. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఈ కాల్ సెంటర్ ద్వారా వచ్చే ఫిర్యాదులను పర్యవేక్షిస్తుంది. అనంతరం సంబంధిత అధికారులకు, శాఖలకు బదలాయిస్తారు. కాల్ సెంటర్ పరిష్కార వేదిక గా ప్రజలకు అందుబాటులో ఉంటుంది. రోజుకి 12 గంటల చొప్పున ఈ కాల్ సెంటర్ సేవలు అందిస్తుంది. ఈ కాల్ సెంటర్కు వచ్చే ఫిర్యాదులను ముఖ్యమంత్రి నిత్యం పరిశీలిస్తారు, వచ్చిన సమాచారాన్ని విశ్లేషించి సంబంధిత శాఖలకు రోజువారీ నివేదిక పంపేలా చర్యలు తీసుకోనున్నారు. పైసా ఖర్చు లేకుండా ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు చక్కని వేదికగ కాల్ సెంటర్ ఏర్పాటవుతోంది. ప్రజలు ఇచ్చే సలహాలను, సూచనలను తీసుకుని సుపరిపాలన అందించే దిశగా అడుగు లేస్తోంది. ఈ సాంకేతికంగా కార్వీ సంస్థ ఈ కేంద్రాన్ని నిర్వహిస్తుంది. ప్రభు త్వం దగ్గర ఉన్న సాధికార సర్వే తదితర వనరుల ద్వారా ఉన్న మొబైల్ నంబర ్లకు కాల్ సెంటర్ నుంచి సిబ్బంది ఫోన్ చేసి ప్రజా స్పందన తెలుసుకుంటారు, ప్రజల నుంచి వచ్చే సమస్యల పరిష్కారానికి కూడా చర్యలు తీసుకుంటారు.