ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మోడీ బిజీ మే 12 నుంచి జూలై వరకు విదేశీ పర్యటనల్లో ప్రధాని

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Apr 21, 2017, 01:06 AM

న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ విదేశీ పర్యటనలతో మరోసారి బిజీకానున్నారు. మే 12 నుంచి జూలై నెల మధ్య వరకు ఆయన వివిధ దేశాల్లో పర్యటించి, ఆయా దేశాలతో బంధాలు బలపరచనున్నారు. శ్రీలంక పర్యటన నుంచి ఆయన పర్యటనల షెడ్యూల్‌ ప్రారంభమవుతుంది. ఆ తరువాత అమెరి కా, ఇజ్రాయెల్‌, రష్యా, జర్మనీ, స్పెయిన్‌, కజికిస్తాన్‌ దేశాలలో పర్యటించను న్నారు. ఈ మేరకు ప్రధాని షెడ్యూల్‌ ఖరారైంది. దాని వివరాల్లోకి వెళితే...


1) మే 12 నుంచీ 14 వరకు ప్రధాని శ్రీలంకలో పర్యటించనున్నారు. అక్కడ జరిగే ఐక్యరాజ్య సమితి వేసక్‌ దినోత్సవాలతో పాటు అంతర్జాతీయ బౌద్ధ సమ్మేళనంలో కూడా పాల్గొననున్నారు.


2) జూన్‌ 1 నుంచీ 3 వరకు రష్యాలోని సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌లో మోడీ పర్యటించనున్నారు. అక్కడ నిర్వహించనున్న సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌ అంతర్జాతీయ ఆర్థిక వేదిక సమావేశాల్లో పాల్గొంటారు.


3) జూన్‌ 7, 8 తేదీల్లో కజకిస్తాన్‌లో జరిగే షాంఘై సహకార సంస్థ సమావేశాల్లో పాల్గొంటారు. ఈ సమావేశానికి చైనా ప్రధాన మిత్ర దేశమైన పాకిస్తాన్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ కూడా హాజరు కానున్నట్టు సమాచారం.


4) జులై 7, 8 తేదీల్లో జర్మనీలోని హాంబర్గ్‌లో జరగనున్న జి20 దేశాల శిఖరాగ్ర సదస్సుకు హాజరు కానున్నారు.5) అమెరికా, ఇజ్రాయెల్‌లలో ప్రధాని పర్యటనకు సంబంధించి తేదీలు ఖరారు కావాల్సి ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com