విజయవాడ,సూర్యప్రతినిధి: అర్చుకులు,ఆలయ కార్మికుల పదవి విరమణ వయస్సును 65 కు పెంచుతామని మంత్రి మాణిక్యాలరావు తెలిపారు. దేవాదాయశాఖపై మంత్రి మాణిక్యాలరావు సమీక్ష నిర్వహించారు. శుక్రవారం మంత్రి మాణిక్యాలరావు మాట్లాడుతూ అర్చకులు,ఆలయ కార్మికుల పదవీ విరమణ వయస్సు 65కి పెంచుతామని ఆయన అన్నారు. దేవాదాయ శాక ఉద్యోగులకు హెల్త కార్డులు జారీ చేస్తున్నామని తెలిపారు. అన్ని ఆలయాల్లో ఎల్ఈడీ బల్పులు, సోలార సిస్టమ్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో అన్ని ఆలయాల చరిత్రపై పుస్తకాన్ని రూపొందించి ఎయిర్పోర్టులు, బస్టాండ్లు, స్టార్హోటళ్లలో అందుబాటులో ఉంచుతామన్నారు. దేవాదాయ భూసమస్యల పరిష్కారానికి లోక్ అదాలత్ ఏర్పాటు చేస్తామని తెలిపారు.