విజయవాడ, సూర్య బ్యూరో : రాష్ట్రంలో ఉల్లి, పసుపు పంటలకు గిట్టుబాటు ధరలు కరువై రైతులు అగమ్యగోచరంలో ఉన్నారు. ప్రస్తుతం ఉల్లి క్వింటా ధర రు.400 నుండి రు.500 మ్త్రామే పలుకుతోంది. ఉల్లి పంట క్వింటాకు కనీసం రు.1400 ధర కల్పిస్తేగానీ రైతుకు గిట్టుబాటు కాని పరిస్థితి నెలకొందని ముఖ్య మంత్రి చంద్రబాబుకు ఇచ్చిన వినతిప్త్రంలో తెలియజేసినట్లు సీపీఐ రాష్ర్ట కార్యదర్శి రామ కృష్ణ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పెట్టుబడులు పెరిగిన నేపథ్యంలో కనీస గిట్టుబాటు ధరలు లేకపోవడంతో ఉల్లి రైతుకు కన్నీళ్ళే మిగులుతున్నాయన్నారు. మన రాష్ట్రంలో పసుపు పంట కడప, గుంటూరు, కృష్ణా జిల్లాలలో ఎక్కువగా పండిస్తున్నారన్నారు. వర్షాలు లేకపోవడంతో పసుపు పంటకు ఆశించినంత దిగుబడి రాలేదన్నారు. ఒక ఎకరా పసుపు పంట సాగుచేయడానికి రు.1,50,000లకు పైగా ఖర్చవుతోందన్నారు. సాధారణంగా పంట దిగుబడి ఎకరాకు 25 నుండి 35 క్వింటాలు వస్తుందన్నారు. అయినా ఈ సంవత్సరం క్వింటా పసుపు ధర రు.4000 రూపాయల నుండి రు.4,500ల ధర మ్త్రామే పలుకుతోందన్నారు. 2012వ సంవత్సరం తరువాత ఇంత కనిష్ట ధర ఏనాడూ లేదన్నారు. ఈ పరిస్థితుల్లో పసుపు రైతు గిట్టుబాటు ధర లేక ఆయోమయంలో కొట్టుమిట్టాడుతున్నాడన్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి కనీస గిట్టుబాటు ధర క్వింటాకు రు.10 వేల రూపాయలు నిర్ణయించి మార్కెఫెడ్గ, నాఫెడ్గల ద్వారా కొనుగోలు చేయించేందుకు చర్యలు చేపట్టవలసినదిగా కోరుతున్నామన్నారు. లేని పక్షంలో మిర్చి తరహాలోనే క్వింటాకు రు.3 వేల రూపాయలిచ్చి రైతులను ఆదుకోవలసినదిగా, ఉల్లికి క్వింటా రు.1400 గిట్టుబాటు ధర కల్పించవలసినదిగా కోరుతున్నామన్నారు.