తిరుమల, సూర్య ప్రత్యేక ప్రతినిధి : టిటిడి కాల్ సెంటర్కు ఫోన్ చేయగానే భక్తులకు మొబైల్ యాప్ గురించిన సందేశం వినిపించేలా కాలర్ట్యూన్ సిద్ధం చేయాలని టిటిడి కార్యనిర్వహణాధికారి డాక్టర్ డి.సాంబశివరావు అధికారులను ఆదేశించారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో మంగళవారం ఇఓ తిరుమల జెఇఓ కె.ఎస్.శ్రీనివాసరాజుతో కలిసి సీనియర్ అధికారులతో వారపు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఇఓ మాట్లాడుతూ గోవింద తిరుమల తిరుపతి దేవస్థానమ్స్ మొబైల్ యాప్ను ఇప్పటి వరకు 60 వేల మంది డౌన్లోడ్గ చేసుకున్నారని, మరింత మంది డౌన్లోడ్గ చేసుకునేలా తిరుమలలోని రేడియో, బ్రాడ్గకాస్టింగ్ విభాగం, ఎస్వీబీసీ, సప్తగిరి మాసపత్రిక ద్వారా విసృ్తతంగా ప్రచారం చేయాలని సూచించారు. తిరుమలలో గదుల బుకింగ్, ఇతర సేవలు పొందేందుకు ఆధార్కార్డు నంబరు ఉంటే చాలని, జిరాక్స్ కాపీలు సమర్పించాల్సిన అవసరం లేదని అన్నారు. శ్రీవారి ఆలయం, వైకుంఠం క్యూకాంప్లెక్స్1,2 ప్రాంతాల్లో అగ్నిమాపక పరికరాలను తరచూ పరిశీలించాలని సూచించారు. వేసవిలో భక్తులకు రోజుకు 50 వేల మజ్జిగ ప్యాకెట్లు అందిస్తున్నామని, గత శని, ఆదివారాల్లో 70 వేల మందికి అందించామని తెలిపారు. ఇందుకు కృషి చేసిన అన్నప్రసాద విభాగం అధికారులను ఇఓ అభినందించారు. తిరుమల ఘాటన రోడ్లలో వాహనాల రాకపోకల సమయాన్ని జూనన నెలాఖరు వరకు ఒక గంటపాటు పొడిగించామని ఇఓ తెలిపారు. ఇప్పటి వరకు రాత్రి 12 నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు ఘాట్రోడ్డు మూసి ఉండేదని, గురువారం నుంచి రాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున 2 గంటల వరకు మ్త్రామే మూసి ఉంచుతామని వెల్లడించారు. ఈ కారణంగా భక్తులు తిరుపతిలోనే గదులు బుక్ చేసుకుని శ్రీవారి ఆర్జితసేవలు, బ్రేక్ దర్శనానికి వెళ్లవచ్చని, తద్వారా తిరుమలలో గదుల బుకింగ్పై ఒత్తిడి తగ్గుతుందని తెలిపారు. తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో కూలర్తో కూడిన ఆర్ఓ.ఓ ప్లాంట్ను ఏర్పాటు చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. వారాంతంలో విఐపి ఏరియాలోనూ గదుల ఆక్యుపెన్సీని పెంచేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ఈ నెల 25వ తేదిన కాశీర్మర్లోని వైష్ణోదేవి ఆలయంలో స్వచ్ఛభారత్ కార్యక్రమం జరుగనుందని, టిటిడి తరపున డిఎఫ్ఓ శివరామ్ప్రసాద్, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ శర్మిష్ట, వాటర్వర్క్స ఇఇ శ్రీనివాసులు హాజరుకానున్నారని ఇఓ తెలిపారు. తుంబురు తీర్ధంలో లోతు గల ప్రమాదకరమైన ప్రాంతాలను గుర్తించి ఇనుప గ్రిల్స్తో మెష్ ఏర్పాటు చేయాలని సూచించారు. 20 సంవత్సరాలు పూర్తయిన కాటేజి దాతలు మళ్ళీ ఆదాయపన్ను మినహాయింపు పొందాలంటే కాటేజి డొనేషన్ స్కీమ్లో తిరిగి చేరాల్సి ఉందని, దీనికి సంబంధించిన విధి విధానాలను రూపొందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. తిరుమల శ్రీవారి ఆలయం నుంచి ఆభరణాలు కానుకగా ఇచ్చేందుకు వీలుగా టిటిడి అనుబంధ ఆలయాల్లో జరిగే ప్రధాన ఉత్సవాల షెడ్యూలు రూపొందించాలన్నారు. ఈ సమావేశంలో టిటిడి చీఫ్ ఇంజనీర్ చంద్రశేఖర్రెడ్డి, ఎఫ్ఏసిఎఓ బాలాజి, విఎస్ఓలు రవీంద్రారెడ్డి, సదాలక్ష్మి, విమలకుమారి తదితరులు పాల్గొన్నారు.