హైదరాబాద్: బీడబ్ల్యూఎఫ్ తాజా ర్యాంకింగ్స్లో భారత స్టార్ షట్లర్, రియో ఒలింపిక్స్ పతక విజేత పీవీ సింధు కెరీర్లోనే అత్యుత్తమంగా ఐదో స్థానం దక్కించుకున్న నేపథ్యంలో ట్విటర్ వేదికగా సింధు అభిమానులందరూ ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. టెన్నీస్ తార సానియా మీర్జా, అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సభ్యురాలు నీతా ముఖేశ్ అంబానీ, కేంద్రమంత్రి విజయ్ గోయల్ తదితరులు సింధును అభినందించారు. కెరీర్లో ఉత్తమ ర్యాంకు సాధించిన సింధుకు శుభాకాంక్షలు, స్త్రీ శక్తిని చాటావు, ఈ తరం అమ్మాయిలకు నువ్వే స్ఫూర్తి అంటూ ట్వీట్ చేశారు. అనంతరం సింధు వారందరికీ ధన్యవాదాలు తెలిపింది.