విశాఖపట్నం :వేసవి తాపంతో అల్లాడిపోతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఒక చల్లటి కబురు అందించింది వాతావరణ శాఖ. అగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అప్పపీడనం కారణంగా రానున్న రెండు రోజులలో తెలంగాణలోని కొన్ని ప్రాంతాలలోనూ, ఏపీ కోస్తా జిల్లాలలోనూ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం ఒక ప్రకటనలో పేర్కొంది.