ఎన్నికల్లో తన ప్రచారానికి అనూహ్య స్పందన వచ్చినా, లక్షలాది మెగా అభిమానులు తన వెంట నడచినా జనసేన బోల్తా పడటానికి కారణాలను విశ్లేషించుకుంటున్న జనసేనాని పవన్ కల్యాణ్ ఆమధ్య పార్టీలో కమిటీలు వేస్తానని, పార్టీని మరింత పటిష్టం చేస్తానని హడావుడి చేసి ఆపై అక్కడితోఆగి పోయాడు.
తాను మళ్లీ సినిమాల జోలికి పోనని, పార్టీ కోసం పనిచేస్తానని గట్టిగా చెబుతున్న పవన్పై నమ్మకమున్న వాళ్లంతా ఇప్పటి నుంచి ఆయన ప్రజా క్షేత్రంలో ఉంటే వచ్చే ఎన్నికల నాటికి ధీటైన ప్రత్యామ్నాయంగా ఎదగొచ్చని కార్యకర్తలు భావిస్తున్నారు.
నలభయ్యేండ్ల చరిత్ర ఉన్న టీడీపీ ఆర్ధిక సంపత్తి బేరూజు వేసుకుంటూ ఎలా పార్టీని అయిదేళ్ళు నడపాలా అని సతమతమవుతున్నప్పుడు, అయిదేళ్ల పాటు జనసేనని తన పార్టీని ఎలా కాపాడుకుంటారన్న మీమాంశ అభిమానుల్లోనూ ఉంది. ముఖ్యంగా ఆర్ధిక అంశాలే ఆ పార్టీని వేధిస్తున్నాయి. గతంలో వ్యాపార వేత్తలతో ఓ స్థార్ హోటల్లో సమావేశం నిర్వహించి, డబ్బులు వసూళ్లకు పాల్పడ్డారంటూ ఆరోపనలు ఎదుర్కొన్న నేపథ్యంలో ఒకసారి దారుణంగా ఓడిన పార్టీ మీద డబ్బులు పెట్టడానికి ఎవరూ ముందుకు వస్తారన్నది సందేహమే. అంతే కాదు పవన్ కల్యాణ్ కి ఎన్నో సవాళ్లు ఎదురవుతుండటంతో పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్తారన్న ఆవేదన పార్టీలో అభిమానులకు ఉంది. ఈ క్రమంలోనే తమ వెండితెర వేలుపు, నాయకుడు పవన్ కళ్యాణ్కు అండగా నిలవాలని ఫ్యాన్స్ భావిస్తున్నట్టు సమాచారం. పార్టీని నడిపేందుకు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నందున పెద్ద ఎత్తున విరాళాల సేకరణకు నడుం బిగించారు . పవన్ కళ్యాణ్ బర్త్ డే అయిన సెప్టెంబర్ 2 న వంద కోట్ల రూపాయలను విరాళంగా సేకరించిఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికే ఆన్ లైన్ ద్వారా విరాళాల సేకరణ చేపడుతున్నారు.
కాగా టీడీపీతో పోలిస్తే ఆయనకు ఉన్న అడ్వాంటేజ్ సినీ నటుడిగా గ్లామర్, రాజకీయంగా చూసే ఆయన వయసు యువకుడి కిందనే లెక్క కావడం. బలమైన సామాజిక వర్గం వెంట ఉండడం వంటివి ఆయనకు అనుకూలంగా ఉన్నాయి. ఐతే బీజేపీ కేంద్రంలో ఉన్న బలంతో ఏపిలో హడావుడి చేస్తు, గత ఎన్నికలలో ఓడిన జనసేన నేతలపైనా కన్నేసింది. వీటిని తట్టుకుని పవన్ కల్యాణ్ నిలబడాలంటే పార్టీ కార్యాలయాలు ప్రతిచోట ఆరంభించేలా చూసేందుకు మెగా ఫ్యాన్ తీసుకున్న వందకోట్ల విరాళం ఎందాక ఆదుకుంటుందో చూడాలి.