ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చంద్రబాబు ఇంటిపై వివరణ ఇచ్చిన ఎమ్మెల్యే అనిత

Andhra Pradesh Telugu |  IANS  | Published : Fri, Apr 14, 2017, 01:08 AM

తిరుపతి,సూర్యప్రతినిధి: సీఎం చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే రోజా మరో సారి విమర్శలు చేశారు. మూడేళ్ల పాలనలో ఒక్క పేదవాడి కూడా ఇల్లు కట్టించని సీఎం, కోట్ల రూపాయల వ్యయంతో హైదరాబాద్‌లో ఇల్లు నిర్మించు కున్నారని ఆరోపించారు. తెలుగు సరిగా పలకని లోకేష్‌.


ఐటీ శాఖ మంత్రి కావడం దౌర్బాగ్యమని విమర్శించారు.రోజా వ్యాఖ్యలపై టీడీపీ ఎమ్మెల్యే అనిత కౌంటరిచ్చారు. తిరుమలను రాజకీయవేదికగా చేయడం తగదన్నారు. సీఎం స్థాయి వ్యక్తి తన పాత ఇంటినే మార్పులు చేర్పుల చేసి 200 6 గజాల్లో ఓ ఇంటిని కట్టుకోవద్దా. చంద్రబాబు ఇంటిపై రకరకాల విమర్శులు చేస్తున్నారు. ఈ విమర్శలు బాధ కలిగిస్తున్నాయి. ఇప్పుడు లోకేష్‌ గురించి మాట్లాడుతున్నారు. లోకేష్‌కు లేని అర్హత ఏమిటీ. లోకేష్‌ అచ్చమైన తెలుగులో ప్రతి ఒక్కరితో మంచిగా మాట్లాడుతారు అని అనిత రోజాకు కౌంటరిచ్చింది.  తిరుమల తిరుపతి దేవస్థానంలో వైసీపీ ఎమ్మెల్యే రోజా రాజకీయాలు మాట్లాడటం దురదృష్టకరమని ఎమ్మెల్యే అనిత అన్నారు. పవిత్రమైన తిరుమల ఆలయ ప్రాంగణంలో రాజకీయాలు సరికాదన్నారు. తిరుమల రాజకీయాలకు వేదికగా మారకూడదని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు.ఇదిలా ఉంచితే.. తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న తర్వాత ఆమె మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా రాష్ట్రంలో కరువు వస్తదని, కోట్లు రూపాయలతో సీఎం చంద్రబాబు ఇళ్లు కట్టుకున్నాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com