ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఐలా ఎన్నికల రగడ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Apr 14, 2017, 12:35 AM

  విజయవాడ, సూర్య బ్యూరో : ఆటోనగర్‌ ఐలా ఎన్నికలు ఒక్క వర్గానికి కొమ్ము కాసే విధంగా ఉన్నాయని ఐలా ఎన్నికల అధికారి ఆర్‌ వెంకటరావు ఎక పక్షంగా వ్యవహరిస్తున్నారని ఐలా చైర్మన్‌గా పోటీచేస్తున్న అభ్యర్ధి మహ్మద్‌ సాధిక్‌ ఆరోపించారు. గురువారం నగరంలోని మాజీ ఐలా చైర్మన్‌ ఎడమ వీరయ్య నివాసంలో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మార్చి 30వ తేదిన ఐలా ఎన్నికల నోటిఫికేషన్‌ ఇచ్చారని నామినేషన్‌ ఆఖరి గడువు ఏప్రిల్‌ 10వ తేది కాగా 11వ తేది అభ్యర్దుల స్క్రూట్ని జరిగిందని అన్నారు. అభ్యర్దుల స్క్రూట్ని పూర్తి అయ్యాక ఇరు వర్గాలను పిలిచి ఎన్నికల అధికారి వెంకటరావు పచ్చ ఇంకుతో సంతకం చేసి అభ్యర్దుల నామినేషన్‌లను అంగీకరించారని అన్నారు. నామినేషన్‌ల స్క్రూట్ని తర్వాత ఎవరిని తొలిగించిన విషయం చెప్పలేదన్నారు. అయితే ఎన్నికల నోటిఫికేషన్‌కు అనుగుణంగానే తమ అభ్యర్దుల నామినేషన్‌లు వేసినట్లు ఆయన తెలిపారు. మరో వర్గం ఇచ్చిన ఫిర్యాదు అంటూ నామినేషన్‌ స్క్రూట్నిని అయ్యాక తమ వర్గం 7 అభ్యర్దులను అనుర్హులుగా ప్రకటించడం ఎన్నికల అధికారికి సరైంది కాదని ఆవేదన వ్యక్తం చేశారు. నామినేషన్‌ స్క్రూట్ని తర్వాత కొత్త నిబంధన వచ్చిందని అందువనే ఈ పొరపాటు జరిగిందని ఎన్నికల అధికారి చెప్పడం సరైంది కాదని ఎన్నికల అధికారి తీరుకు నిరసంగా వివిధ సంఘాల నాయకులు, కార్మికులు ఐలా ఎదుట ఎన్నికలను రద్దు చేయాలని కోరుతూ నిరసన వ్యక్తం చేసి ఐలా ఎండి నివేధిక ఇస్తున్నట్లు పేర్కొన్నారు. దీనికి స్పందించి తమ అభ్యర్దులను ఎన్నికల అర్హులుగా ప్రకటించాలని లేకుంటే న్యాయం పోరాటం చేసి ఆమరణ నిరాహర దీక్షకు కుర్చుంటామని హెచ్చరిం చారు. ఈ సమావేశంలో ఐలా మాజీ చైర్మాన్‌ ఎడమ వీరయ్య, రాజనాల బాబ్జి, చెందు వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com