తిరుమల: తిరుమలలో కొండ చిలువ కలకలం రేపింది. శ్రీగంధం వనంలో కూలీలపై దాడి చేసి ఓ వ్యక్తిని కరిచింది. పాపవినాశనం రహదారిలోని అటవీ ప్రాంతంలో తితిదే శ్రీగంధం మొక్కలను పెంచుతోంది. ఈరోజు ఆ వనంలో పనిచేస్తున్న హరి అనే కార్మికుడిపై 15 అడుగుల పొడవున్న కొండచిలువ దాడి చేసి కరిచింది. అప్రమత్తమైన మిగతా కూలీలు హరిని రక్షించి హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఆగ్రహంతో కొండచివులను కర్రలతో కొట్టి చంపేశారు.