ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుమలలో కొండచిలువ కలకలం

Andhra Pradesh Telugu |   | Published : Wed, Apr 12, 2017, 03:02 PM

తిరుమల: తిరుమలలో కొండ చిలువ కలకలం రేపింది. శ్రీగంధం వనంలో కూలీలపై దాడి చేసి ఓ వ్యక్తిని కరిచింది. పాపవినాశనం రహదారిలోని అటవీ ప్రాంతంలో తితిదే శ్రీగంధం మొక్కలను పెంచుతోంది. ఈరోజు ఆ వనంలో పనిచేస్తున్న హరి అనే కార్మికుడిపై 15 అడుగుల పొడవున్న కొండచిలువ దాడి చేసి కరిచింది. అప్రమత్తమైన మిగతా కూలీలు హరిని రక్షించి హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఆగ్రహంతో కొండచివులను కర్రలతో కొట్టి చంపేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com