డెహ్రడూన్: బెడ్ 'టీ 'ఇవ్వనందుకు గాను భార్యను కత్తెరతో పోడిచి చంపాడు ఓ భర్త. ఈ ఘటన ఉత్తరాఖండ్ రాష్ట్రంలో చోటుచేసుకొంది.ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని పౌరీ జిల్లాలోని కొటిడ్వార్ ప్రాంతంలో మంగళవారం నాడు ఉదయం చోటుచేసుకొంది. 38 ఏళ్ళ సంగీత్ సింగ్ నేగీ కాశీంపూర్ గ్రామానికి చెందిన కోటీడ్వార్ లో నివాసం ఉంటున్నాడు.అయితే ఆయన భార్య ఆర్తీతో కలిసి జీవనం సాగిస్తున్నాడు.మంగళవారం ఉదయం పూట ఆర్తీని సంగీత్ సింగ్ నేగీ బెడ్ టీ అడిగాడు భార్య ఆర్తీని. అయితే ఆమె మాత్రం ఆయనకు బెడ్ టీ ఇవ్వలేదు. Related Videos 01:11 భార్యను, బిడ్డను అర్థరాత్రి ఎయిర్పోర్టులో వదిలేసి 01:14 తండ్రే కసాయి: ఇద్దరు పిల్లలను చంపాడు 02:19 యువతి సజీవ దహనం బెడ్ 'టీ 'ఇవ్వనందుకు గాను భార్య,భర్తల మద్య గొడవ జరిగింది. దీంతో బెడ్ టీ ఇవ్వనని ఆమె తేల్చి చెప్పేసింది.దీంతో భర్త ఆగ్రహంతో ఊగిపోయారు.బెడ్ రూమ్ తలుపులు వేసి రెండు కత్తెరలను తీసుకొని ఆమె పై దాడి చేశాడు.ఆమె చనిపోయేవరకు అతను పొడిచి చంపేశాడని పోలీసులు తెలిపారు. అయితే ఈ సమయంలో ఆర్తీ తనను రక్షించాలని కేకలు వేసింది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. 11 ఏళ్ళ కొడుకు, 9 ఏళ్ళ కూతురు ఉంది. ఈ ఘటన జరిగిన సమయంలో పిల్లలు వేరే రూమ్ లో ఉన్నారు.