తిరుమల: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని బుధవారం పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఏపీ శాసనసభాపతి కోడెల శివప్రసాద్, సినీనటులు రకుల్ప్రీత్సింగ్,మంచు లక్ష్మి శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ప్రముఖులకు తితిదే అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం వారికి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.