తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వెంకన్న స్వామి దర్శనం కోసం భక్తులు 6 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. స్వామి వారి సర్వదర్శనానికి 3 గంటలు, కాలినడక భక్తులకు 2 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంట సమయం పడుతుంది. నిన్న శ్రీవారిని 68,619 మంది భక్తులు దర్శించుకోగా, 25,863 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.27 కోట్లు.