విజయవాడ, సూర్య బ్యూరో : మంత్రి నారా లోకేశ్ను రాజధానికి భూములిచ్చిన రైతులు మంగళవారం కలిశారు. ఈ సందర్బంగా వచ్చే నెల 6న తుళ్ళూరు, పెదపరిమి గ్రామాల్లో జరిగే సాయిబాబా ఆలయ ప్రతిష్ట, ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు లోకేశ్ను వారు ఆహ్వానించారు.
ప్రభుత్వ పనితీరుకు ‘స్థానిక’ ఫలితాలే నిదర్శనం...
రాష్ర్ట ప్రభుత్వ పనితీరుకు రాష్ర్ట వ్యాప్తంగా జరిగిన స్థానిక సంస్థల ఉప ఎన్నికల ఫలితాలే నిదర్శనమని రాష్ర్ట మంత్రులు నారా లోకేశ్, కిమిడి కళా వెంకట్రావ్ పేర్కొన్నారు. మంగళవారం వారు విలేకరులతో మాట్లాడుతూ స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించిందని, రాష్ర్టం మొత్తంలో 37 వార్డులకు ఎన్నికలు జరగ్గా అందులో 21 స్థానాలను టీడీపీ గెలుచుకుందని వారు తెలిపారు. మహిళలు, రైతులు, యువత, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు ప్రభుత్వం వైపుమొగ్గు చూపుతున్నారనడానికి ఈ ఫలితాలే నిదర్శనమన్నారు.