విజయవాడ, సూర్య బ్యూరో : తిరుమల తిరుపతి దేవస్థానం నిధు లతో రాష్ర్టంలో నిర్మి స్తున్న ఆలయాల పురో గతిపై ధర్మ పరిరక్షణ ట్రస్ట్, సమరసతా సేవా ఫౌండేషన్ సం యుక్తంగా సమీక్షించింది. గుంటూ రు జిల్లా తాడేపల్లి పరిధి లోని సీతానగరంలోని దేవాలయ పాలనా సంస్థ రాష్ర్ట కార్యాల యంలో జరిగిన సమావేశానికి సమరసతా సేవా ఫౌండేషన్ అధ్యక్షులు, విశ్రాంత ఐఏఎస్ అధికారి మూర్తి అధ్యక్షత వహించారు. హిందూ ధర్మపరిరక్షణ ్టస్ట్ అధ్యక్షులు విశ్రాంత ఐఏఎస్ అధికారి పీవీఆర్కే ప్రసాద్ నేతత్వంలో సమీక్షించారు. రాష్ర్టంలో నిర్మిస్తున్న 500 ఆలయాలు రూపురేఖలు ఎలా ఉండాలనే అంశంపైనా చర్చిం చారు. తొలి విడత 72 మంది అర్చకులకు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. ఎక్కడ దేవాలయ నిర్మిస్తున్నారో ఆ ప్రాంతానికి చెందిన వారిని అర్చకులుగా ఎంపిక చేయాలని భావించారు. వీరికి తిరుమల తిరుపతి దేవస్థానం సౌజన్యంతో శిక్షణ ఇస్తే బాగుంటుందని సమావేశం అభిప్రాయ పడింది. ఈనెల 25 నుంచి శిక్షణ ప్రారంభించాలని సంకల్పిం చారు. నూతనంగా ప్రారంభించబోయే ఆలయాల్లో 72 దేవతామూర్తుల విగ్రహాలు అవసరమని భావిస్తున్నారు. మహిళలను ధర్మప్రచార కార్యక్రమాల్లో భాగస్వా ములను చేయాలని సమావేశం నిర్ణయించింది. ధర్మప్రచారానికి ఉప యోగిం చే రథాలకు టోల్టాక్స్ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరింది. రాష్ర్ట దేవాలయ పాలనా సంస్థ డైరెక్టర్ విజయరాఘవాచార్యులు, విశ్రాంత చీఫ్ ఇంజినీరు కొండల రావు, దేవాదాయశాఖ పర్యవేక్షక ఇంజినీరు సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.